తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Saturday, June 18, 2016

దేవుడికి పనిపాటాలేదా ? నన్నెందుకు పట్టించుకోవాలి ?

చెట్లు కొట్టేస్తా - వానలుపడవు - కాలం మారిపోయింది అంటూ తెగ బాధపడతాను

పెద్దవారిని కూడా గౌరవించను - నాకు మర్యాదలేదని బాధపడతాను - కాలం మారిపోయిందని దొంగఏడుపులు ఏడుస్తా

అవసరమున్నా,లేకపోయినా బైకులో చాలా వేగంగా వెళతాను - జనం ఎవరూ రూల్సు పాటించరని గగ్గోలు పెడతాను

నోరు తెరిస్తే అబద్దమే వస్తుంది - కానీ నిజానికి విలువలేదని గుండెలు బాదుకొంటా

మూర్ఖుడైనా తనదైన రోజున మహత్కార్యాన్ని చేసి గొప్పపేరు సంపాదిస్తాడు. నిజమైన గొప్పతనం అనేది ఒకరు చేసిన గొప్పపనిని బట్టికాక అతను తన దైనందిన జీవితములో చేసే చిన్నచిన్న పనులను ఏవిధముగా చేస్తున్నాడనేదాన్ని బట్టి ఉంటుంది.ఇది స్వామి వివేకానందుని మాట.

1.మనము తాగడానికి నీరులేదని, పాలకులు సరిగా లేరని బాధపడతాము. అదే నీరు రోజూ వస్తూ నీటిగొట్టాలు పగిలిపోయి నీరు వృథాగా వెళ్ళిపోతున్నా పట్టించుకోము. లేక కుళాయికి ట్యాపులేక నీరు వెళ్ళిపోతుంటే కనీసము ఏదైనా అడ్డుపెడదామన్న ఆలోచనకూడా రాదు. వచ్చినా మిగతావారు చూసుకుంటారులే, నాకెందుకు అనుకొని వెళ్ళిపోతారు. నీళ్ళైతే పట్టుకొంటారు కాని నీరు వృథాగా పోతుంటే పట్టించుకోరు. ఎవరూ పట్టించుకోకుంటే నీటిసరఫరా విభాగపు వారిని తిడతారు. అంతేకాని మన బాధ్యత మనకు పట్టదు. కనీసము వారికి ఫోను ఐనా చేసి చెపుదామన్న ఆలోచన కూడా రాదు. 

2.ఇంకొందరు విదేశాలకు వెళ్ళివచ్చి అక్కడ ఎంతో శుభ్రముగా ఉంటుందని మనదేశములో అలా ఉండదని తెగ బాధపడిపోతుంటారు. ఇక విదేశాలు చూడని వారైతే TV లో ఆయా దేశాలను చూసి మన దేశము అలా లేదని బాధపడుతుంటారు. ఏ ప్రభుత్వ పథకమైనా జనము పాటిస్తేనే ఆ పథకము విజయవంతము అవుతుంది. కనీసము మనము అంతరాత్మ చెప్పినట్లైనా నడుచుకోము. మనకు తెలుసు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేసినా, ఉచ్చ పోసినా అనారోగ్యమని, మరియు శుభ్రతకు భంగము అని. కాని మనము ఏమి చేస్తున్నామో మనకు తెలుసు. విదేశాలలో ఉన్నప్పుడు అక్కడి నియమాలు పాటించినప్పుడు అవే నియమాలు ఇక్కడ ఎందుకు పాటించరు? మాటలైతే ఎన్నో మాట్లాడుతారు.

ఇలా ఒకటా,రెండా ఎన్నో చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. మొదట నిద్రలేవగానే "నేను" అనే స్పృహ కలిగిన తర్వాతే మిగతా ప్రపంచము గోచరిస్తుంది. అంటే ఏ పనైనా వ్యక్తిగతము నుండే వస్తుంది. ప్రతి మనిషి తన బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తే హక్కులు వాటంతట అవే వస్తాయి. అలా రాకున్న పోరాడే హక్కు కూడా ఉంటుంది. అంతే కాని హక్కులే తప్ప బాధ్యతలు తెలుసుకోనంత కాలం జీవితాలు అలానే ఉంటాయి.

ఇలాంటి మనలను భగవంతుడు ఎందుకు పట్టించుకోవాలి?

గమనిక: ఈ టపా అందరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు. కాని చాలామంది ప్రజలనే ఉద్దేశించి వ్రాసినది

Friday, June 17, 2016

నువ్వెంత ? నీ తలకు ఉన్న విలువెంత ?

టైటిల్ చూసి భయపడకండి. ఇది ఒక జరిగిన నీతికథ

ఒకసారి అశోకుడు,తన మంత్రి ఒక వీధిలో నడుస్తున్నారు.

దారిలో ఒక బౌద్ధసన్యాసి ఎదురు రాగా అశొకుడు తన కిరీటం తీసి పక్కన పెట్టి తన తలను ఆ సన్యాసి పాదాలపై ఉంచి నమస్కరించాడు. ఈ దృశ్యం చూసి మంత్రి ఒక చక్రవర్తి ఒక సామాన్య సన్యాసికి అంత గౌరవం ఇవ్వడం అనవసరం అని భావించాడు. ఈ విషయాన్ని అశోకుడు గమనించాడు.

తర్వాత ఆ మంత్రికి పాఠం నేర్పదలచి తన మంత్రి తో ఒక గొర్రెతల, ఒక ఎద్దు తల, ఒక మనిషితల తెమ్మని చెప్పాడు. మంత్రి అలాగే తెచ్చాడు. తర్వాత వాటిని బజారులో అమ్ముకొని రమ్మని మంత్రిని పంపాడు. మేక,ఎద్దు తలలను అమ్మగలిగాడు కానీ మనిషి తలను ఎంత ప్రయత్నించినా అమ్మలేకపోయాడు. అదే విషయం అశోకునికి చెప్పగా మనిషి తలను ఉచితంగా ఐనా ఎవరికైనా ఇచ్చి రమ్మన్నాడు. కాని ఏ ఒక్కరూ మనిషితలను తీసుకోవడానికి కాని, కనీసం చూడడానికి కూడా ఇష్టపడలేదు.

మంత్రి తిరిగి సభకు రాగా అశొకుడు అన్నాడు " ఆ రోజు నా తలను ఆ సన్యాసి పాదాలపై పెట్టగా నువు ఏంటి ఇలా చేశారు రాజు అనుకున్నావు. ఇప్పుడే చూసావు కాదా మనిషి తల యొక్క విలువ. బ్రతికి ఉన్నంత వరకే మనిషి తలకు విలువ.చనిపోయిన తర్వాత ఎద్దు,మేక లాంటి జంతువుల తలలకైనా విలువ ఉంటుంది కాని అసలు మనిషి తలను అసలు చూడడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు,ఇక విలువ సంగతి ఏం చెప్పాలి".

Thursday, June 16, 2016

దేవుడిపై నిజంగా నమ్మకం ఉందంటున్నవాడు మతం మారితే అది మోసమే

ఆర్థిక కారణాలతోనో లేక సామాజిక కారణాలతోనో మతం మారేవారిని మనం చూస్తూనే ఉన్నాము. అలాకాకుండా భగవంతుడి ఉనికి పట్ల మనస్పూర్తిగా నమ్మకం ఉన్నవాడు ఎన్నటికీ మతం మారవద్దని చెప్పే ఒక యదార్థ సంఘటన ఇప్పుడు చూద్దాం.

శృంగేరీ పీఠాధిపతి అయిన చంద్రశేఖరభారతీ స్వాముల వారి వద్ద జరిగిన విషయం ఇది. ఒకనాడు ఒక విదేశీ క్రైస్తవుడు స్వామివారిని కలవడానికి వచ్చినాడు. అక్కడ స్వామి వారికి అతనికిమధ్య జరిగిన సంభాషణ ఇలా జరిగింది.

విదేశీయుడు: "స్వామీ! మీరు అనుసరిస్తున్న సనాతనధర్మం పట్ల నేనెంతో ఆకర్షితుడైనాను.నేను కూడా మీ మతంలో చేరాలనుకుంటున్నాను.అనుగ్రహించండి"

స్వామి వారు: "మీకు భగవంతుడి ఉనికి పట్ల నిజంగా నమ్మకం ఉందా?"

విదేశీయుడు:ఉందండీ.

స్వామివారు:"సరే మీరు మీ ఇష్టప్రకారమే ,మీ తల్లిదండ్రులను మీరే ఎన్నుకుని జన్మించారా?"

విదేశీయుడు: "అలా ఎలా అవుతుందండీ. అది మన చేతుల్లో లేదు కదండీ. దేవుడు అక్కడ నన్ను జన్మించాలని ఆదేశించాడు. అందుకు అక్కడ పుట్టాను".

స్వామివారు: మరి మీఇష్టప్రకారమే మరణిస్తారా?

విదేశీయుడు: అదికూడా మనచేతుల్లో ఏముందండీ.అంతా ప్రభువు దయే కదండీ.

స్వామివారు: మరి మీ పుట్టుకకు, చావుకు కారణం భగవంతుడు అని మీరు నమ్ముతున్నప్పుడు అదే భగవంతుడు మిమ్మల్ని ఫలానా మతంలోనే ఎందుకు పుట్టించాడంటారు. అది అతడి నిర్ణయం అని మీరు ఎలా మర్చిపోతున్నారు. మీ బైబిల్ లో కూడా అద్భుతమైన విషయాలు ఉన్నాయి కదా. వాటిని ఆచరించవచ్చు కదా.

విదేశీయుడు: అవునండీ. మీరు చెప్పినది నిజమేనండీ. ప్రతిమతంలోనూ సత్యం ఉందండీ. అలానే మా మతంలో కూడా ఉందండీ. నన్ను క్షమించండి.

స్వామివారు: మీరు మీ మతంలోనే ఉంటూ ఒక నిజమైన క్రైస్తవుడు గా మంచి అభ్యున్నతి పొందండి. ఏ మతం ద్వారా ఐనా భగవంతుడిని సాక్షాత్కరించుకోవచ్చు.

చూసారు కదండీ. ఇదీ విషయం.

Sunday, April 3, 2016

ఉత్తములకీ మనకీ తేడా !

మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
.
.
జరిగిన కధ !
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం .
.
18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !
.
అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు .
.
అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు Ignace J. Paderewski. వద్దకు వెళ్ళారు . ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ , ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు . వీళ్ళు అంగీకరించారు . టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు . మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది .
.
వాళ్ళు Paderewski. దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ , 400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ , క్షమించమనీ అన్నారు .
.
వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు . ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు
.
" మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి . మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి . ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "
.
ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ !
మనలో చాలామందిమి అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని
అదే ఉత్తములకీ మనకీ తేడా !
.
ఇది ఇక్కడితో ఆగిపోలేదు
.
Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు .
.
మొదటి  ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది . 15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు .
.Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు . దానికి అధిపతి Herbert Hoover . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది . పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది .
.
Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు
.
" కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు . వారిలో నేను ఒకడిని "
.
ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశం . నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతా సారం ఇది .
.
The world is a wonderful place. What goes around usually comes around.

-- సేకరణ

Friday, March 18, 2016

పసిపిల్లల చేష్టలు మనకు ఎందుకంత ఆనందం కల్గిస్తాయి?

మనందరికీ అనుభవమే ఈ విషయం. పసిపిల్లల పనులు, వారి చేష్టలు మనకు ఎంతో ఆనందం కల్గిస్తాయి. అలాగే ఇంట్లోని పెంపుడు జంతువుల చేష్టలు కూడా మనకు ఎంతో ఆనందం కల్గించి మన మనసులను టెన్షన్ నుండి దూరం చేస్తుంటాయి. అసలు వారి పనుల వలన మనకు ఎందుకు ఆనందం కల్గుతోంది? అవే పనులను పెద్దవాళ్ళు చెస్తే మనకు ఒక్కొక్కసారి కోపం,అసహ్యం కూడా కల్గుతుంటాయి.


పసిపిల్లల చేష్టలు మనకు ఆనందం కల్గించడానికి కారణం ఒక్కటే. వారు చూసేవారికి ఆనందం కల్గించడానికి అలా ప్రవర్తించరు. వారి పనులు పరిపూర్ణసహజత్వం కల్గిఉన్నవి. వారి సహజస్వభావం ప్రకారం పనులు చేస్తుంటారు. వారు ఎలాంటి ముసుగులనూ ధరించి ఉండరు. వారి మనసులలో కపటత్వం ఉండదు కేవలం నిర్మలత్వం మాత్రమే ఉంటుంది. ఇక్కడ ముసుగులు అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకలా ఉండడం లాంటివి. చివరికి వాళ్ళ కోపం కూడా ఎంత సహజం గా ఉంటుందంటే వారు కోపగించుకోవడాన్ని కూడా మనం ఆనందిస్తాము. "అబ్బ ఎంతకోపం వీడికి" అంటూ మురిసిపోతాము.


కాలం గడవగా గడవగా ఏమవుతుందంటే చుట్టుపక్కల పరిస్థితుల వలన ఆ సహజత్వం కోల్పోయి ఒకరిని ఆనందపెట్టడానికో లేక బాధపెట్టడానికో ప్రవర్తించడం వలన ఇక వారి చేష్టలు మనకు అసలైన ఆనందం ఇవ్వలేవు.


సమస్త వేదాంతానికీ మూలసూత్రం ఇదే. ఎవరైతే తమ బాల్యం లో లాగా నిర్మలమైన,కపటత్వం లేకుండా అత్యంత సహజంగా తమకు తెలియకుండానే ప్రవర్తిస్తారో వారికి తెలియకుండానే వారి పనుల వలన జీవులు ఆనందిస్తుంటాయో వారే భగవంతునికి అత్యంత సమీపంగా తమకు తెలియకుండానే ఆయన సాన్నిధ్యం అనుభవిస్తుంటారు.

Wednesday, March 16, 2016

అయినదానికీ కానిదానికీ ఆత్మహత్యలు చేసుకొనేవడమేనా? ఆగి ఆలోచించండి..- హనుమంతుడు

చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకొంటున్న యువత కానీ, పనిలో విజయం కోసం వేచిఉండలేని ప్రజలు కానీ హనుమంతుని ఉపదేశాలను (తను పాటించినవాటిని) తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

లంకలో సీతమ్మను వెతకడంలో హనుమంతుడు కూడా నిరాశ పొందాడు. కాని వెంటనే అతను చేసిన ఆలోచన యుగాల పర్యంతం మనకు ఆదర్శముగా ఉంటాయనడం అతిశయోక్తి కాదు.

సీతమ్మ కనపడక నిరుత్సాహం పొందిన హనుమంతుడు, వెంటనే
"శ్రేయస్సుకు(మంచి కలుగడానికి) , సుఖం కలుగడానికి, అన్ని పనులు సాగడానికి ఉత్సాహమే మూలము.ఉత్సాహం కల్గిన మనిషి సర్వకార్యాలందు విజయం పొందుతాడు. వాడు చేసిన కార్యం విజయవంతం అవుతుంది. అందుచేత ఉత్సాహం కోల్పోకుండా నేను మరల మరల సీతమ్మను వెదుకుతాను." అని ఆలొచించి తిరిగి సీతమ్మను వెదకడములో నిమగ్నమైనాడు.

ఐనా సీతమ్మ కనపడకపోవడముతో ఆత్మహత్య చేసుకోవాలని సంకల్పించుకొని, తిరిగి హనుమ ఒక క్షణంలో ఆలొచించిన తీరు అత్యధ్బుతం.

"చనిపోవుట అనేక దోషాలకు కారణమవుతుంది. బ్రతికుంటే ఏనాటికైనా శుభం కలుగుతుంది. అందువలన నేను చనిపోను."

నేటి వ్యక్తిత్వవికాస పుస్తకాలలో ఏమైతే ఉందో ఆనాడే హనుమంతుడు ఆలోచించి ఆచరించిన విధానము, మనకు ఆదర్శముగా నిలిచిన విధానము ఏనాటి మనుషులైనా, ఏ ప్రాంతపు మనుషులైనా ఖచ్చితముగా తెలుసుకొని ఆచరించి తీరవలసినవి కావంటారా ?

Monday, February 29, 2016

ఈ రోజుకి నా వయసు 9 పుట్టినరోజులు...ఎలా ?

ఈ రోజుకి నా వయసు 9 పుట్టినరోజులు...
సమాధానం చెప్పండి..

Friday, February 19, 2016

251 రుపాయలకు ఫోనా ? మనం గొర్రెలమవుతున్నామా ?


ఆఫ్ట్రాల్ ఫోన్ పౌచ్ కొనడానికి కనీసం అన్నా 80 నుండి 200 రుపాయల వరకు, ఫ్లిప్ కవర్ ఐథే 200  నుండి 1000 రూపాయల వరకు అవుతుంది...
అలాంటిది ఫోన్ 251 రూపాయలంటే ?
టచ్ స్క్రీన్ తయారు చేయడానికే 1000 రూపాయల నుండి నుండి మొదలవుతాయి...

అసలు ఇది ఎంతదాకా వెళుతుందో చూడాలి...

మనము మూకుమ్మడిగా గొర్రెలవుతున్నామనుకొంటున్నాను..

Saturday, February 13, 2016

అమ్మా! సరస్వతి మాతా మమ్మల్ని క్షమించు..



క్రింది భావాన్ని పూరించండి.

మేము "భారతీ"యులం, పేరులో మాత్రమే సరస్వతీస్వరూపులం..
మిగతా అంతా .... ?



                                                                                                                   

Tuesday, January 5, 2016

మనకు వినోదం పంచేవాడికి ఉన్న విలువ మన ప్రాణాలను కాపాడేవాళ్ళకు ఇవ్వని దౌర్భాగ్యులం మనం...



ఒక సినిమా హీరోనో లేక మరో సినీప్రముఖుడో పోతే మన సొంత మనిషే పోయాడన్నంతగా బాధపడతాము. మంచిదే అతడు మీకు వినోదాన్ని పంచాడు. కాని వినోదం ఎప్పటివరకు ? మన ప్రాణం ఉన్నంతవరకే.

మరి ఆ ప్రాణాలను కాపాడడానికే అనుక్షణం జీవిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరజవానుల కోసం ఒక కన్నీటిబొట్టైనా రాలదే !

మన మనసు అంత బండబారిపోయిందా ?

పఠాన్‌కోట్ అమర జవానులకు నివాళులు మరియు దేశసైన్యానికి వందనాలు.

Friday, January 1, 2016

కూడలి బ్లాగుల సంకలిని(అగ్రిగేటర్) మూతపడడం మనసుకు బాధగా ఉంది



ఇప్పుడే చూస్తున్నాను. కూడలి వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే కూడలిని మూసివేస్తున్నట్లు ప్రకటన.
బ్లాగు రాయడం మొదలు పెట్టినప్పటి నుండి కూడలికి బాగా అలవాటు పడ్డాను. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి ఇంకా మనసు స్వీకరించలేకపోతోంది. అసలు ఏమయ్యిందో అర్థం కావడం లేదు.

చాలా బాధాకరంగా ఉంది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు