తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, June 17, 2010

మంత్రాలకు చింతకాయలు ఎందుకు రాలకూడదు?

ఒక మనిషిని "ఓ మూర్ఖుడా!,నువ్వెందుకూ పనికిరావు" అంటే కృంగిపోవచ్చు లేక అన్నవాడిపై కోప్పడవచ్చు. అప్పటి వరకు అతను ఎంత ఆనందంగా ఉన్నా ఈ మాట అనేసరికి ముఖం అంతా మాడిపోయి,డీలా పడిపోయి ఇంతకు ముందు మనం చూసిన అతను ఇతనేనా అనుకొనేట్లు మారిపోతాడు.

అలానే " మీ అంత మంచివారు ఈ కాలంలో చాలా అరుదండీ!, మీరు చాలా గొప్పవారు" అంటే పొంగిపోతాడు. ఆ పొంగు బయటకు కనపడకపోవచ్చు కాని మనసు ఆనందపడుతుంది.

పైన చెప్పిన రెండు సందర్బాలలోనూ ఏమాత్రం పట్టించుకొనని వారు నూటికో,కోటికో కొందరే ఉంటారు. అంటే ప్రతిస్పందన(Reaction) చూపేవారు నూటికి 95 శాతం పైమాటే.

ఇక్కడ మనం మాట్లాడే మాటలు ఆ వ్యక్తిపై ప్రభావం చూపుతున్నాయి కదా. అంటే మనసున్న ప్రతి మనిషీ మాట్లాడే విధానాన్ని బట్టి అతని స్వభావం, అందుకు తగినట్లు ముఖకవళికలు మారుతాయి కదా. చివరికి జంతువులు కూడా మన మనసు బాగా లేనప్పుడు, మనం కోపంతో గట్టిగా అరుస్తున్నప్పుడు అవి కూడా మన వద్ద ముభావం(Dull) గా ఉంటాయి కదా. ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుస్తుంది. అంటే మనసు పై మాటల ప్రభావం ఖచ్చితం గా ఉంటుందని అందరికీ తెలుసు.

ఇక అసలు విషయానికి వద్దాం.

నేటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అని మొక్కలకు,చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని అలానే మనసు కూడా ఉంటుందని, అవి కూడా తమ భావాలను(ఆనందం లేక బాధలను) వ్యక్తపరుస్తాయని తెలుస్తోంది. మనం పరిహాసం గా మాట్లాడితే ఆ మాటల పౌనఃపున్యము, స్థాయి ఒకలా ఉంటాయి. అలానే సీరియస్ గా మాట్లాడినప్పుడు కూడా ఆ మాటల పౌనఃపున్యము,స్థాయిలు వేరేగా ఉంటాయి. అందరికీ ఈ సైన్సు విషయాలు తెలియకపోవచ్చు. కాని తెలిసినా,తెలియకున్నా జరిగేది జరుగుతూనే ఉంటుంది కదా.

అంటే ఎలా మాట్లాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయం పై మనకు ఒక అవగాహన(Idea) ఉంటుంది కదా. మరి మనలానే మనసు గల చెట్లపై నిర్ధిష్ట పౌనఃపున్యము, స్థాయి గల మాటలు మాట్లాడితే అవి కాయలు రాల్చనూవచ్చు, లేక చెట్టే పడిపోవనూవచ్చు అనే విషయం పై అనుమానం ఎందుకుండాలి. మంత్రాలంటే ఒక విధివిధానం గల మాటలే కదా.

ఋషులంటే కేవలం ఆధ్యాత్మికవాదులే కాదు కదా, ఏ శాస్త్రంలో నిష్ణాతులైనా వారిని ఋషులనే అంటాము. ఉదాహరణకు కణము అనే భావనను కనిపెట్టిన కణాదున్ని ఋషి అనే అన్నాము. మంత్రాలతో పనులు చేయవచ్చు అని అన్నది ఆ ఋషులే కదా.

మన కాలపు మనుషులకు తెలిసింది పూర్వకాలపు మనుషులకు తెలియకపోవచ్చు, అలానే వారికి తెలిసింది మనకు తెలియకపోవచ్చు. అంతమాత్రాన కేవలం హేతువును లేక తర్కాన్ని పట్టుకొని వారు చెప్పింది అసంభవం,బూటకం అని అనడం ఎంతవరకు సమంజసం? వారు చెప్పిన దానిపై పరిశోధన చేద్దాం. తప్పని ఋజువైతే అప్పుడు బూటకం అందాం. మనం ఏ పరిశోధన చేయకుండా ,ఊరకే పనీపాటాలేని పెద్దలు రచ్చబండ పైనో, చెట్ల క్రిందనో కూర్చొని చెప్పారు, అని అవి బూటకం అని ఎలా అనగలం.

గమనిక: మంత్రాలకు చింతకాయలు రాలడం అనే భావన ను ఒక ఉదాహరణగా మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నేను మంత్రాలను నమ్మమనీ చెప్పడం లేదు, అలాగే నమ్మవద్దనీ చెప్పడం లేదు. విశ్వాసం,నమ్మకం ఉన్న వారిని వారి మానాన వారిని వదిలెయ్యండి. పరిశోధనల ఫలితంగా మీరనుకొన్నదే ఋజువైతే కనుక అప్పుడు మాట్లాడవచ్చు. ఏ విషయమైనా మన ఊహకు అందనంత మాత్రాన ఆ విషయంపై అతి తొందరగా ఒక అభిప్రాయానికి రావద్దని మాత్రమే నేను చెప్పదలచుకొన్నది.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు