తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Tuesday, August 19, 2008

దశావతారాలు - అంతరార్థం

ఈ క్రింద చెప్పబడిన విషయాలను ఆధ్యాత్మిక దృష్టి ద్వారా లేక మతపరంగా కాకుండా విజ్ఞానదృష్టి తో చూడాలని కోరుతున్నాను.
మనందరికీ తెలుసు శ్రీమహావిష్ణువు యొక్క దశావతరాలు.
అవి వరుసగా చేప,తాబేలు,పంది,నరసింహ,వామన,పరశురామ,శ్రీరామ,శ్రీకృష్ణ,బుద్ధ మరియు కల్కి అని.
ఇక్కడ మీరు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సృష్టి పరిణామక్రమం,మనిషి జీవనవిధానం అర్థమవుతుంది.

అదెలాగంటే

1.చేప : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.
2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.
3.పంది : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.
4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.
5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.
6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.
7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.
8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.
9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.
10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు