తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స

Thursday, July 31, 2008

భారతదేశం యొక్క ఘనత (ప్రపంచానికి అందించినవి)

1. సున్న("0") ను కనుగొన్నది ఆర్యభటుడు (ఈతని పేరే మన దేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి పెట్టారు)
2.గత 1000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు.
3.క్రీ.పూ 700 సంవత్సరంలోనే ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని తక్షశిలలో నిర్మించారు.ఇక్కడ సుమారు 10,500 మంది ప్రపంచంలోని నలుమూలలనుండి వచ్చి విద్యను అభ్యసించారు.క్రీ.పూ 400 లో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు.
3."ఫోర్బ్స్" పత్రిక ప్రకారం కంప్యూటర్ కు అత్యంత అనుకూలమైన భాష సంస్కృతం.
4.పాశ్చాత్యప్రపంచం ఈ మధ్య కనుగొన్న ప్లాస్టిక్ సర్జరీ ని ఏనాడో 2600 సంవత్సరాలకు పూర్వమే సుశ్రుతుడు చేసాడు.
5.దేశప్రాంత పటాలు 5000 సంవత్సరాల పూర్వమే సింధునాగరికత కాలంలోనే మనవారు కనుగొన్నారు.ఆంగ్ల పదం నావిగేషన్ మన సంస్కృత పదం ఐన నవగతిః నుండి వచ్చింది.
6.పైథాగరస్ సిద్దాంతాన్ని,"పై" విలువను మొదటిసారిగా కనుగొన్నది మన భారతీయులే.
7.గ్రీకులు,రోమనులు 105 అంకెల వరకు లెక్కించిన కాలంలోనే మనవారు 1053 వరకు లెక్కించారు.
8.1896వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే ఏకైక వజ్రాల ఉత్పత్తిదారు,ఎగుమతిదారు ఒక్క భారతదేశమే.
9.మార్కోని కన్నా ముందే జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలను కనుగొన్నాడు.
10.చదరంగం కనుగొన్నారు.
11.పాశ్చాత్య ప్రజలు ఇంకా అడవులలోనే జీవిస్తున్నకాలం లోనే మనవారు సింధునాగరికత లో ఉన్నారు.
12.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.

Wednesday, July 30, 2008

త్రైలింగస్వామి (మన మహాత్ములు)

త్రైలింగస్వామి 1601 వ సంవత్సరం లో ఆంధ్రదేశం లో జన్మించి సుమారు 280 సంవత్సరాలు జీవించిన మహాత్ముడు.వీరి తల్లిదండ్రులు నరసింగరావ్,విద్యావతి.స్వామి వారు శివుడి అవతారంగా చెప్పబడ్డారు.

స్వామివారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరాం.స్వామి చిన్నప్పటినుండే మిగతా పిల్లల లాగ ఆటపాటలలో పాల్గొనకుండా ఎప్పుడూ ఏకాంతం కోరుకునేవాడు.తన తల్లి చెప్పే రామాయణ,మహాభారతాలు మొదలైన మతగ్రంథాలు ఎంతో ఆనందంగా వినేవాడు.ఇతను తన తల్లిదండ్రుల సేవలో 52 సంవత్సరాలు గడిపాడు.అప్పుడు తన తల్లి మరణించగా గురువును వెదుకుతూ ఇల్లు వదలిపెట్టి వెళ్ళిపోయాడు.తన సాధనను తన ఊరి శ్మశానంలో ప్రారంభించాడు.తర్వాత అతను నేపాల్ తో సహా చాలా ప్రదేశాలు తిరిగి చివరికి కాశి చేరుకొని అక్కడ సుమారు 150సంవత్సరాలు పైన ఉన్నాడు.

స్వామివారు కేవలం ఆకులూఅలములు,పండ్లుఫలాలు తిని సంవత్సరానికి ఒక పౌండు చొప్పున పెరిగి 300 పౌండ్ల బరువుకి పెరిగినట్టు చెపుతారు.

స్వామివారు ఎన్నోవిషపూరిత ద్రవాలు త్రాగికూడా ఎటువంటి తేడా లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు.వేలాదిప్రజల సాక్షిగా రోజుల తరబడి గంగానది పై తేలుతూ ఉండేవారు.ఒక్కొక్క సారి నీటిపై కూర్చుని ప్రజలకు కనిపించేవారు.ఒక్కొక్కసారి నీటిలోపల ,అలలక్రింద రోజుల తరబడి ఉండిపొయేవాడు.వేసవికాలం లో మిట్టమధ్యాహ్నం మణికర్ణికాఘాట్ లో ఎర్రగా కాలే ఇసుక పై స్వామి పడుకోవడం ,స్వామికి ఏమీకాకుండా ఉండటం చూడటం అక్కడి ప్రజలకు అలవాటే.

స్వామివారు అద్వైతఙ్ఞానసిద్ది పొందారనడానికి క్రింది సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది.

స్వామి వారు విషపూరితద్రవాలు త్రాగి కూడా ఏమీకాకుండాఉండడం చూసి ఒక వ్యక్తి స్వామివారు అబద్దాలకోరు అని ఋజువుచేయడానికి ఒకరోజు ఒక కుండ నిండా సున్నం తీసుకుని స్వామివారికి అందులో పెరుగు ఉందని చెప్పి ఇచ్చాడు.సర్వజ్ఞులైన స్వామివారు మారుమాటాడకుండా త్రాగినారు.
త్రాగిన వెంటనే ఇచ్చిన అతను కడుపులో మంట అంటూ పొర్లాడసాగాడు.స్వామివారిని కరుణించమన్నాడు.అప్పటికి ఎన్నోరోజుల నుండి మౌనంలో ఉన్న స్వామి తన మౌనం విరమించి "ఓయి ధూర్తుడా!సర్వ ప్రాణులలో ఉన్న ఆ పరబ్రహ్మమే నా కడుపులో కూడా ఉన్నాడన్న జ్ఞానం నాకు ఉంది కాబట్టే నేను నీవిచ్చిన విషపూరిత సున్నం త్రాగి కూడా బ్రతికినాను.ఇంకెప్పుడు ఇలా చేయవద్దు.వెళ్ళీపో"అన్నాడు.ఆ ఇచ్చిన వ్యక్తి బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు.

స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉండేవారు.అప్పటి ఆంగ్లేయులకు ఇది చాలా కష్టంగా ఉండేది.అందువలన ఎన్నోసార్లు స్వామిని పట్టుకొని కారాగారంలో పెట్టారు.కానీ స్వామివారిని పెట్టిన నిమిషం లోపే స్వామివారు కారాగారపు పైకప్పులపైన పచార్లు చేస్తూ కనిపించేవారు.ఒక సారి స్వామివారిని న్యాయస్థానం లో హాజరుపరిచారు.అక్కడి న్యాయమూర్తి స్వామివారితో "మీరు అన్నిటిలో దేవున్ని చూస్తున్నారని చెప్పారు కదా.అలా ఐతే నీ మలం నీవే తినగలవా?"అని ప్రశ్నించాడు.స్వామివారు ఏ మాత్రం సంకోచించకుండా అక్కడే మలవిసర్జన చేసి తన మలం తనే తిన్నాడు.ఆశ్చర్యకరంగా స్వామివారి మలవిసర్జన తర్వాత న్యాయస్థానం అంతా సుగంధభరితం అయ్యింది.ఈ దెబ్బతో స్వామి వారిపై ఆంగ్లేయులు మరెప్పుడూ ఫిర్యాదు పెట్టలేకపోయారు.

ఇలా స్వామివారి జీవితంలో ఎన్నో మహిమలు జరిగాయి.

స్వామివారు పుష్యశుక్లఏకాదశి నాడు (డిసెంబర్ 1881) నాడు సమాధి పొందారు.వీరి సమాధి కాశి లో పంచగంగఘాట్ లో ఉంది.

స్వామి వారిని దర్శించిన మహాత్ములు: శ్రీరామకృష్ణపరమహంస,శారదామాత,స్వామి వివేకానంద,పరమహంస యోగానంద,నరసింహ యోగీంద్రులు మొదలగువారు.
క్రియాయోగాన్ని బాబాజి ద్వారా గ్రహించి ప్రపంచానికి అందించిన లాహిరీ మహాశయులు త్రైలింగస్వామికి అత్యంత ఆప్తమిత్రులు.

స్త్రీ అనగా

స్త్రీ అను పదం మూడు అక్షరాలను కలిగిఉంది.అవి స,త,ర.

స - సత్వగుణం - పిల్లలను ప్రేమతో పెంచడం,భర్తను అత్తమామలను,ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడం
త - తమోగుణం - పిల్లలను తీర్చిదిద్దడంలో వారిని దండించడం
ర - రజోగుణం - పిల్లలను కనడం

భారతదేశం అనగా

1.సంగీతపరంగా
భా-భావ ర-రాగ త-తాళ యుక్తమైనది భారతదేశం
2.వేదాంతపరంగా
భా(వెలుగుతో) రత(సంగమించేది అనగా నిండిఉండునది) భారతదేశం
3.యోగపరంగా
భా(వెలుగుతో అనగా సత్వగుణంతో) ర(రజోగుణాన్ని) త(తమోగుణాన్ని) జయించినది భారతదేశం

Tuesday, July 29, 2008

సదాశివబ్రహ్మేంద్రస్వామి (మన మహాత్ములు)

సదాశివబ్రహ్మేంద్రస్వామి వారు తమిళనాడు లో జన్మించిన మహాత్ముడు.వీరి తండ్రిగారి పేరు మోక్షసోమసుందర అవధాని.వీరు రామ,కృష్ణులను పూజించేవారు.వీరి భార్య పేరు పార్వతి .ఈమె శివుడిని పూజించేది.అందువలన వీరు తమకు కలిగిన కుమారుడికి శివరామకృష్ణ అని పేరు పెట్టారు.
ఇతను చిన్నప్పటి నుండే మిగతా పిల్లల కంటే తేడాగా ఉండేవాడు.వైరాగ్యం మొదలగు భావాలు ఉండేవి.అందువలన పెళ్ళి చేస్తే అంతా సరిపోతుందని వీరి తల్లిదండ్రులు భావించారు.మొదట స్వాములవారు వ్యతిరేకించినా ఒక కుమారుడిగా వారు చూసిన అమ్మాయిని 17 సంవత్సరాల వయస్సు లో పెళ్ళాడాడు.
కానీ అతను ఏ మాత్రం మారలేదు.అతనిలో వైరాగ్య భావాలు దృఢంగా ఉన్నాయి.ఇలా ఉండగా అతని భార్య పుష్పవతి అయ్యింది( ఆ కాలం లో బాల్యవివాహాల ఆచారం ఉండేది).మొదతిరాత్రిని స్వామిగారి మామగారింట్లో చేయాలని అందుకు తగ్గ వంటావార్పూ,సంభారాలు మొదలు పెట్టారు.స్వామికి విపరీతంగా ఆకలి అయ్యి వంటగది వద్దకు వెళ్ళి "నాకు ప్రత్యేక వంటకాలు అవసరం లేదు.ఏదుంటే అది పెట్టండి తినడానికి"అన్నాడు.అప్పుడు వారి అత్తగారు"దయచేసి కొద్దిసేపు వేచిఉండండి.మీరు ఎక్కువసేపు వేచి ఉండనవసరం లేదు.లోనికిరావద్దు.బయటనే ఉండు"అన్నది.

"లోనికిరావద్దు.బయటనే ఉండు" అన్న మాటలు స్వామిలో అనుకోని మార్పును వెంటనే తీసుకుని వచ్చింది."గృహస్థాశ్రమం లోకి రావద్దు.బయటనే ఉండి జ్ఞానాన్ని పొందు" అని స్వామివారు అర్థం చేసుకున్నారు.ఆకలినే తీర్చలేనివాళ్ళు తనకు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు?అని అనుకుంటూ స్వామి అక్కడినుండి వెల్లిపోయారు.బందువులు అతన్ని కనుగొనలేకపోయారు.

అతను తర్వాత అడవులలోనూ,నదీ తీరాలలోనూ గడిపాడు.భిక్షాటన చేసుకుని ఆకలి తీర్చుకునేవాడు.తనకే ఉండడానికి ప్రదేశంలేనివాడు దేవుడికి ఎక్కడ ప్రదేశం చూపించి పూజించాలి?అందువలన తన హృదయంలో పూజించేవాడు.ఈ మానసిక పూజను తన "శివ మానసికపూజ" అను స్తోత్రంలో వర్ణించాడు.

"ఓ శివా! అంతటా నీవి వ్యాపించిఉన్నావు.నిన్ని నేనెక్కడ పూజించగలను?ఆకాశమే నీ వస్త్రాలైనప్పుడు నీకు నేను ఏ వస్త్రం ఇవ్వగలను?"అంటూ స్తోత్రం చేశాడు.

ఈ హృదయవిదారక ప్రార్ఠన విని శివుడు స్వామివారికి కామకోటిపీఠంకు చెందిన పరమశివేంద్రసరస్వతి ని గురువుగా పంపాడు.గురువుగారు స్వామిని చూసి అతని లోని చైతన్యాన్ని గుర్తించి "సదాశివా"అంటూ పిలిచాడు.అప్పటి నుండి "శివరామకృష్ణ" పేరు "సదాశివ"అయ్యింది.వారి పీఠం పేరు కలుపుకొని "సదాశివబ్రహ్మేంద్రసరస్వతి" అయ్యింది.తన గురువుగారిని ఎంతగానోసేవించి అనేక కీర్తనలు,స్తోత్రాలు బ్రహ్మసూత్రాలకు పాతంజలయోగసూత్రాలకు వ్యాఖ్యానం చేసాడు.అన్నిటిని తన గురువుకు అంకితం చేసాడు.తన స్తోత్రాలకు మకుటం గా "పరమహంసగురు" అని ఎంచుకున్నాడు.
స్వామివారు ఎంతోమందితో వాదించి అందరినీ ఓడించేవాడు.ఒకసారి ఇలా ఓడిన పండితుడు గురువుగారికి ఫిర్యాదు చేసాడు.అప్పుడు గురువు గారు" ఓ! సదాశివా! నీవు ఎప్పుడు నిశ్శబ్దంగాఉంటావు?"అన్నాడు.మీ అనుగ్రహంతో ఇప్పుడే అంటూ సదాశివులవారు అన్నారు.గురువుగారి నుండి వెళ్ళిపోయి తను మౌనంలో అనుభవించిన అనుభవాలను తన కీర్తనల్లో వర్ణించాడు.లౌకిక విషయాలను వదిలి పెట్టి తనలోనే ఆత్మజ్ఞానాన్ని అనుభవిస్తూ ,తన దగ్గరకు వచ్చింది తింటూ జీవించాడు.

ఒకసారి ఈవిధంగా సమాధిస్థితిలో ఒక గడ్డివాము దగ్గర నిలిచున్నాడు.ఆ వాము యజమాని స్వామిని ఒక దొంగ అనుకొని కొట్టబోయాడు.వెంటనే అతను శిలావిగ్రహంలా ఉండిపోయాడు.స్వామికి ఇవేమీ తెలియదు.మరుసటి ఉదయం మెలకువలోనికి వచ్చినప్పుడు నవ్వుతూ ఆ రైతు వంక చూడగా ఆశ్చర్యకరంగా అతను మళ్ళీమామూలుగా అయ్యాడు.క్షమాపణ ఆడిగాడు.స్వామి నవ్వుతూ వెల్లిపోయాడు.ఒకసారి ఇదేవిధంగా సమాధిస్థితిలో కావేరి నదీతీరంలో ఉన్నప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోయాడు.మూడునెలల తర్వాత రైతులు ఇసుకమేటలు తొలగిస్తున్నప్పుడు ఒక గడ్డపార తగిలి స్పృహలోకి వచ్చి ఏమీజరగనివాడిలా వెళ్ళిపొయాడు.ఇలాంటి మహిమలెన్నో స్వామిజీవితంలో జరిగాయి.

చివరికి స్వామివారు తమిళనాడులోని నేరూరు లో స్థిరపడ్డారు.అక్కడి రాజు స్వామి ఉపదేశాలను పాటించి పరిపాలన చేసాడు.ఇప్పటికీ తమిళనాడు లో స్వామి కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.

స్వామి వారి ఉపదేశం " నీవుకోరుకున్నది చేయవద్దు.అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చు" అని.

స్వామివారు నేరూరులోనే సమాధి పొందారు.

తెలుగు లిపి యొక్క పరిణామము

విద్యుత్తు ప్రస్తావన (వేదాలు)

ఋగ్వేదం లో ఒక శ్లోకం యొక్క అర్థం(నాకు శ్లోకం దొరకలేదు)

" అప్పుడు ఆ దేవత జలం నుండి ఒక శక్తిని తీశాడు.ఆ శక్తి మూడు పాములు కలిగిఉంది.ఆ పాముల తలలు ఒకటి ముందుకు,ఒకటి వెనుకకు ఒకటి భూమి వైపుకు ఉన్నాయి.ఆ శక్తిని రాక్షసుల పై ప్రయోగించాడు.ఆ శక్తి తగిలిన రాక్షసులందరూ భస్మం అయ్యారు.ఆ శక్తి తిరిగి దేవత దగ్గరకు వచ్చిచేరింది"

శ్లోకం గమనిస్తే పాము మూడు తలలూ ధనాత్మక,ఋనాత్మక మరియు భూమిలోకి(ఎర్త్) లను సూచిస్తున్నాయి.విద్యుత్తు తాకినప్పుడు కలిగే ప్రభావం గురించి చెప్పడం జరిగింది.తిరిగి వలయం(సర్క్యూట్) పూర్తవ్వడం తెలుస్తోంది.

బ్రహ్మజ్ఞాని లక్షణాలు

ఆదిశంకరాచార్యుని "వివేకచూడామణి" ప్రకారం బ్రహ్మజ్ఞాని నాలుగు లక్షణాలు కలిగిఉంటాడు.

అవి బాలక,జడ,పిశాచ మరియు ఉన్మత్త లక్షణాలు.

1.మనస్తత్వంలో స్త్రీ,పురుష భేధాలు లేక బాలక అవస్థ కలిగిఉండడం
2.బ్రహ్మనిష్ఠ(సమాధి స్థితి) లో ఉన్నప్పుడు జడుడిలా ఏమీ పట్టించుకోకుండాఉండడం
3.పగలురాత్రి అనే తేడా ఏమీలెకుండా,ఏమాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చిన విధంగా సంచరించునప్పుడు పిశాచంలా (అంటే శుచిశుభ్రత అనేవి పట్టించుకోకుండా తిరగడం)
4.తమ బ్రహ్మనిష్ఠ కు భంగం కలుగకుండా ఇతరుల పట్ల ఉన్మత్తునిలా (పిచ్చివాడిలా) ఉండడం,కానీ వీరు ఎవరికీ ఎటువంటి హానీ కలిగించరు

Monday, July 28, 2008

శుకమహర్షి - మన పురాణ ఋషులు

శుకమహర్షి మహర్షి వేదవ్యాసుని కుమారుడు.శుకుడు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని.

జన్మరహస్యము:
ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో "స్వామీ, సృష్టి యొక్క రహస్యం ఏమిటి?జనన మరణాలు విధంగా సాగుతున్నాయి?అసలు సృష్టి విధంగా జరుగుతోంది?" మొదలైనవి అడిగింది.అప్పుడు ఈశ్వరుడు "అన్నీ చెప్తాను.కాని ఒక ఏకాంత ప్రదేశంలో చెప్పాలి" అంటూ కైలాసం వదిలి ఏకాంత ప్రదేశమునకు బయలుదేరారు.పరమశివుడు మొదట నంది ని,ఆభరణాలైన పాములను ఒక్కటొక్కటిగా వదిలివేస్తూ పార్వతితో బయలుదేరి చివరకు అమరనాథ గుహను చేరుకున్నారు.అక్కడినుండి పంచభూతములను,గుహలో ఉన్న రామచిలకలను బయటికి పంపివేశినాడు.పార్వతికి రహస్యాలను చెప్పడం మొదలు పెడతాడు.కాని గుహలో ఒక రామచిలక గుడ్డు పగిలి ఒక చిన్న చిలక విషయాలను వింది. విషయం పసిగట్టిన శివుడు ఆగ్రహించి మరణం వచ్చునట్లు శపించాడు.కాని మరుసటి జన్మలో ఒక ఋషిగా పుట్టునట్లు అనుగ్రహించాడు. చిలకే తర్వాతి జన్మలో శుకమహర్షి.అందుకే కొన్ని చిత్రాలలో శుకుడి ముఖము చిలుకలా కనిపిస్తుంది.

పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ మాయ వలన ఇతడు మనలాగే బాల్యం గడిపాడు.అప్పుడు వ్యాసుడు అతనికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించాడు.మిగిలినది తెలుసుకోవడానికి మిథిలా నగరపు రాజు జనకుడి దగ్గరకు పంపాడు.జనకుడు బ్రహ్మజ్ఞాని మరియు రాజర్షి.ఇతడికి విదేహుడు అనే పేరు ఉంది.విదేహుడు అనగా జీవించే ముక్తిని పొందినవాడు.శుకుడు అతనివద్దకు బయలుదేరాడు.జనకునికి విషయం దివ్యదృష్టి ద్వారా తెలిసి శుకుడిని పరిక్షించాలనుకొన్నాడు. తదనుగుణంగా ద్వారపాలకులకు ఆదేశాలిచ్చాడు.శుకుడు రాగానే ద్వారపాలకులు రాజు ఆదేశాల ప్రకారం శుకుడికి విధమైన గౌరవం ఇవ్వకుండా కేవలం కూర్చోవడడానికి ఒక పీఠం మాత్రం ఇచ్చి ద్వారం దగ్గరే కూర్చుండబెట్టారు. విధంగా మూడు రొజులు శుకుడు గడిపాడు.శుకుడు మాత్రం చలింపక అలానే కూర్చున్నాడు.మూడు రోజుల తర్వాత సకల రాజలాంఛనాలతో లోనికి తీసుకెళ్ళారు.శుకుడిని ఒక రాజపీఠం పై కూర్చుండబెట్టినారు.రాజ నర్తకుల నాట్యాలు ప్రారంభమైనవి.కానీ శుకుడు విధంగానూ చలింపలేదు.అప్పుడు జనకుడు శుకుడికి ఒక అంచులవరకు నూనెతో నిండిన పాత్రను ఇచ్చి సభలో ఏడు సార్లు తిరిగిరమ్మన్నాడు.శుకుడు అలా తిరుగుతున్నప్పుడు నాట్యకత్తెలు అతన్ని ఎన్నోవిధాలుగా మోహింపచేసేందుకు ప్రయత్నించారు.కాని శుకుడు మాత్రం తొణకక తిరిగివచ్చి కూర్చున్నాడు.అప్పుడు జనకుడు నేను నీకు ఏమీ భోదించనవసరం లేదు,నీవు బ్రహ్మజ్ఞానివి అన్నాడు.కానీ మీ తండ్రి ఆజ్ఞ ప్రకారము చెపుతాను అని వ్యాసమహర్షి చెప్పినదే చెప్పి పంపివేసాడు.శుకమహర్షి మనోనిగ్రహం ఇలాంటిది.తన ఆజ్ఞ లేనిదే తన మనసు లోకి ఎలాంటి అలోచనను రానివ్వంటువంటి మనోనిగ్రహం కలవాడు శుకుడు.
ఇది జరిగిన తర్వాత శుకుడు తన ఇంటికి వెళ్ళాడు.ఆప్పుడు అక్కడ తండ్రి వేదవ్యాసుడు లేడు.అప్పుడు శుకుడు పంచభూతాలను పిలిచి " నేను ఆడవులకు వెళ్ళిపోతున్నాను.నా తండ్రి వచ్చి నన్ను పిలిస్తే ఓం అని అరవండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.వెదవ్యాసుదు వచ్చి కుమారా!శుకా అని పిలువగా పంచభూతాలు ఓం అని అరిచాయి.అప్పుడు వేదవ్యాసుడు పంచభూతాలతో "మీరు నా కొడుకు గురించి చెప్పకపోతే శపిస్తాను" అని ఆగ్రహించాడు.పంచభూతాలు విషయం చెప్పాయి.శుకుడిని వెతుకుతూ వ్యాసుడు బయలుదేరాడు.కొద్ది దూరంలో ఆకాశ మార్గంలో శుకుడు వెళ్తూ కనిపించాడు.వ్యాసుడు పిలుస్తున్నా శుకుడు పట్టించుకోకుండా వెళ్తున్నాడు.దారిలో ఒకచోట దేవకన్యలు స్నానం చేస్తున్నారు.వారి నవయవ్వనం లోఉన్న,దిగంబరం గా వెళ్తున్న శుకుడిని చూసి కూడా మాత్రం పట్టించుకోకుండా స్నానం కొనసాగించారు.వెనుకనే వేదవ్యాసున్ని చూసి సిగ్గుపడి బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు.ఇది చూసి వ్యాసుడు ఆశ్చర్యంతో" అమ్మాయిలారా!మీరు యవ్వనంలోని నా బిడ్డను చూసికూడా సిగ్గుపడలేదు.కాని ముసలివాడినైన నన్ను చూసి సిగ్గుపడుతున్నారు.ఎందుకు?" అని అడిగాడు.అప్పుడు దేవకన్యలు"మీ కుమారుడు నవయవ్వనం లో ఉన్నా అతడు జితేంద్రియుడు,ఎలాంటి బందాలు లేనివాడు.కాని మీరు మీ పుత్రుడికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించికూడా ఇంకా కొడుకు అనే భ్రాంతిని వదలలేకపోయారు.అందువలన మిమ్ములను చూసినప్పుడు మాకు సిగ్గు కలిగింది.మీ కొడుకుని చూసినప్పుడు మాకు ఎలాంటి వికారము కలుగలేదు" అన్నారు.
ఇదీ శుకమహర్షి చరిత్ర.
శుకుడి విశేషాలు:
1.తిరుమల శ్రీవేంకటేశ్శ్వరస్వామికి పద్మావతితో పెళ్ళికి ముహూర్తం పెట్టింది శుకమహర్షి గారే.
2.శుకుడి గురించి పరమశివుడు పార్వతితో " దేవీ!భగవద్గీత సారాంశము శ్రీకృష్ణుడికి తెలుసు,నాకూ మరియు శుకుడికి పూర్తిగా తెలుసు.వేదవ్యాసుడికి తెలిసుండవచ్చు కొద్దిగా" అని అన్నాడు.
3.మహాభాగవతాన్ని పరీక్షిత్ మహారాజుద్వారా ప్రపంచానికి అందించినది శుకమహర్షిగారే.

Friday, July 25, 2008

సూర్యచికిత్స-ఆలోచించవలసిన విషయము ( వేదాలు)

ఋగ్వేదం, మొదటి మండలం,9 వ అనువాకం 50వ సూక్తం,11వ శ్లోకం

उद्यन्नद्य मित्रमह आरोहन्नुत्तरां दिवम

हर्द्रोगं ममसूर्य हरिमाणं च नाशय

అర్థము:

ఓ సూర్యదేవా! నీవు అందరికీ సమాన తేజస్సు ఇస్తావు.ఉదయం సమయాన ఆకాశము ఎక్కుతావు.నీవు హృదయ రోగమును అలాగే కామెర్లు,పాండురోగము లను నివారింపుము.

ఇక్కడ సూర్యరశ్మిని పై వ్యాధులకు చికిత్స గా చెప్పినారు.
మరి ఇప్పటి విఙ్ఞానము ఈ విషయాన్ని కనుగొన్నదోలేదో నాకు తెలియదు.ఒకవేళ కనుగొని ఉంటే తెలుపగలరు.

Thursday, July 24, 2008

కాంతి - దాని ధర్మము (వేదాలు)

ఋగ్వేదం ఆరవ అనువాకం,30వ సూక్తం లోని 20,21,22 శ్లోకాలు

कस्त उषः कधप्रिये भुजे मर्तो अमर्त्ये कं नक्षसे विभावरि
वयं हि ते अमन्मह्यान्तादा पराकात अश्वे न चित्रे अरुषि
तवं तयेभिरा गहि वाजेभिर्दुहितर्दिवः अस्मे रयिं निधारय


"అంతము ఎరుగని ఉషస్సా! నీవు స్తుతి ప్రియవు.నీ అందాన్ని ఆనందించని మనిషి ఉన్నాడా?ఎవరైనా నీ కాంతి ని అందుకొనగలరా? ఓ ఉషో దేవీ,నీవు విచిత్రమైన రంగులు కలదానవు.ఆ రంగులు వ్యాపించు రీతి అద్భుతము.నీ దగ్గరికి వచ్చి గానీ,దూరం నుండి గానీ నిన్ను ఆస్వాదించుట సాధ్యము కాదు.నీవు ద్యులోకమునకు కూతరువి."

ఇక్కడ ఉషోదేవి అనగా కాంతి కి అధిష్టాన దేవత.ఇప్పుడు మనము విజ్ఞానము లో పాశ్చాత్యులు కనుగొన్నారనుకొంటున్న కాంతి-ఏక వర్ణం కాదు,అనేక వర్ణాలు కలది అన్న విషయం ఈ శ్లోకం లో ఆనాడే మన వేద ఋషులకు తెలుసన్న విషయం అర్థం అవుతోంది.

ఉపనిషత్తుల సందేశము

ఈశావాస్య మిదం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుజ్ఞీథాః మాగృధఃకస్య స్విద్ధనం

సృష్టి అంతా మరియు సృష్టి అంతా భగవంతుని(ఈశ్వరుని) చే ఆవరింపబడిఉన్నది.భగవంతుడు ఇచ్చిన వాటిని త్యాగబుద్ధి చే అనుభవించాలి.పరుల ధనం ఆశించరాదు.ధనము ఎవ్వరి సొంతమూ కాదు.
ఇది ఈశావాస్య ఉపనిషత్తు లోని మొదటి శ్లోకము.

ఓజోన్ - వేదాలు

ఋగ్వేదం 6వ అనువాకం,24 వ సూక్తం లోని 6,7 వ శ్లోకాలు

नहि ते कषत्रं न सहो न मन्युं वयश्चनामी पतयन्त आपुः
नेमा आपो अनिमिषं चरन्तीर्न ये वातस्य परमिनन्त्यभ्वम

अबुध्ने राजा वरुणो वनस्योर्ध्वं सतूपं ददते पूतदक्षः
नीचीना सथुरुपरि बुध्न एषामस्मे अन्तर्निहिताःकेतवः सयुः


అర్థం:
" వరుణ దేవా!నీవు పరాక్రమవంతుడవు.రెక్కలుగల పక్షులు నీని చేరలేవు.నిన్ను అవి సహించలేవు.ప్రవహించే నీరు కూడా నిన్ను చేరలేవు.వరుణుడు రాజులకు ప్రభువు.ఆధారంలేని అంతరిక్షంలో అతను ఉన్నాడు.అతడు తేజో రాణి చే ఆవరింపబడి ఉన్నాడు.కిరణములు అతని పై నుండి క్రిందకు ప్రసరిస్తున్నాయి.అందువలనే మన ప్రాణములు నిలిచిఉన్నవి. కిరణములకు మూలము అంతరిక్షమున ఉన్నది."
గమనించి చూస్తే వరుణదేవుడిని వాతావరణము గా,తేజోరాణి ని ఓజోన్ పొరగా తెలుసుకోవచ్చు.

నీటి చికిత్స అనగా వాటర్ థెరపి - వేదాలు

ఋగ్వేదం లో క్రింది శ్లోకాలు పరిశీలించండి.ఇవి 5వ అనువాకం,23వ సూక్తం లోని 19,20,21 వ శ్లోకాలు

अप्स्वन्तरम्र्तमप्सु भेषजमपामुत परशस्तये देवाभवत वाजिनः
अप्सु मे सोमो अब्रवीदन्तर्विश्वानि भेषजा अग्निं च विश्वशम्भुवमापश्च विश्वभेषजीः
आपः पर्णीत भेषजं वरूथं तन्वे मम जयोक च सूर्यं दर्शे

వీటి అర్థము:

"నీటి యందు అమృతము ఉన్నది.ఔషదములున్నవి.నీటి ప్రాముఖ్యతను చాటండి.ఇందులో సమస్త ఔషదాలున్నవి.నీటిలో విశ్వానికి ఉపయోగపడు అగ్ని ఉన్నది.నీరు మా శరీరమందలి సమస్త రోగాలను నశింపచేయు ఔషదము కావలెను.మేము చిరకాలము సూర్యున్ని చూడాలి అనగా ఎక్కువ కాలం బ్రతకాలి."
నీటి చికిత్స అనగా వాటర్ థెరపి గత శతాబ్దంలో కనుగొన్నట్లు ప్రచారంలో ఉంది.కాని పై శ్లోకాలను పరిశీలించిన అప్పుడే నీటి అద్భుత ఔషదగుణాలు మన ఋషులకు తెసిసినట్టు అర్థం చేసుకోవచ్చు.

Wednesday, July 23, 2008

కృతఙ్నత ప్రాముఖ్యత

నరునకు గల మానవతా లక్షణములలో "కృతఙ్నత" ప్రధానమైనది.కృతఙ్నత అనగా మనకు మంచి చేసిన వారిని మరిచిపోకుండా వారికి తిరిగి ప్రత్యుపకారం చేయుట.అలా చేయకపోవడాన్ని "కృతఘ్నత" అంటారు.రామాయణం లో రాముడు వాలిని చంపి సుగ్రీవునికి సహాయం చేశాడు.కాని సుగ్రీవుడు అది మరిచి తన పనులలో మునిగిపోయాడు.అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవునితో

"బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!
నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః!!"

భావము: బ్రహ్మ హత్యకు,సురాపానమునకు,వ్రతభంగమునకు,దొంగతనానికి ప్రాయశ్చిత్తమున్నది.కాని కృతఘ్నతకు లేదు.
కృతఘ్నుల మాంసము కుక్కలు సైతం తినవు.కాబట్టి కృతఙ్నత చూపడం ముఖ్యం.

Featured Post

వేశ్యల చేత మహాత్ముడు, దేవదూత అనిపించుకొన్న ఓ మహానుభావా! నీకు వందనం

ఒకసారి ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి ఈజిప్టులో తిరుగుతూ పొరపాటున ఒక వేశ్యావాటికలోకి ప్రవేశించాడు. స్వతహాగా ఈ వ్యక్తి చాలా అందగాడు, మంచి స్...

Print Friendly and PDF

నా బ్లాగును ఇష్టపడేవారు